8, సెప్టెంబర్ 2010, బుధవారం

సుప్రీంకు ప్రధాని సలహ....!

"విధానాలు రూపొందించే పరిధి శాసన వ్యవస్థకు సంబంధించింది.అందులో న్యాయస్థానాలు ప్రవేశించరాదు".ఆహార దాన్యాలను వృదాగా గోదాములలో మక్కబెట్టేబదులు పేదలకు పంచమని ఆదేశించిన సుప్రీం కోర్టుకు మన ప్రదానిగారు ఇచ్చిన సలహా ఇది.

ప్రదానిగారు విధానపర నిర్ణయాలు తీసుకొనే పని శాసన వ్యవస్థదే .కానీ ఆ శాసన వ్యవస్త నిర్వీర్యం అవుతున్నప్పుడు.న్యాయవ్యవస్థ కలుగజేసుకోవటం తప్పుకాదేమో.దేశంలో 37 శాతం (మీ లెక్కల ప్రకారమే)ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు ఐనా ఆహార దాన్యాలు ఉచితంగా ఇవ్వడం తప్పే.కొన్ని కోట్ల కుటుంబాలు పస్తులతో,అర్ధాకలితో అలమటిస్తున్నారు .ఐనా ఆహార దాన్యాలు ఉచితంగా ఇవ్వటం తప్పే.కోట్లాది మంది బాలల బాల్యం సరైన పోషకాహారం లేక నిర్వీర్యం అవుతుంది.ఐనా ఆహార దాన్యాలు ఉచితంగా ఇవ్వడం తప్పే.

మన ప్రదాని గారు ఎంతటి ఉదార్థ హృదయులో ఆహార దాన్యాలను సబ్సిడిలో పేదలకు అందించడానికి విధానాలు రుపొందిస్తారంట.ఎంత ఉదారత .గోదాముల్లో ఆహార దాన్యాలు వృదాగా మగ్గిపోతున్న విషయం భయటపడి పది నేలలు దాటి పోయింది.విదానాలు తయారి నిర్ణయం తీసుకోటానికే పది నెలలు పడితే.తయారు చేసేదేప్పుడు,ఆమోదం పొందేదేప్పుడు, ఇక అవి అమలయ్యేదేప్పుడు.ఈ లోపున ఆ ధాన్యాలు కాస్తా ముట్టుకోడానికి కూడా పనికి రాకుండా పోతాయి.ఇక అప్పుడు మీ విదానాలు ఏం చేస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి