ఉద్దేశ్యం

తెలుగు బ్లాగర్లకు,పాఠకులకు వందనములు. నేను అసలు బ్లాగర్ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి కారణం కేవలం తెలుగు భాషాబిమానమే అందుకోసమే తేట తెలుగు అనే బ్లాగ్ మొదలుపెట్టాను.ఎలాగు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి తెలిసిన విషయాలు పంచుకుందామని మరో రెండు బ్లాగులు మతములు,భారతదేశం ప్రారంభించాను.

నాకు మొదటినుండి ఇంకొకరిని విమర్శించటం నచ్చదు."ఒకరి వైపు వేలెత్తి చూపితే నాలుగు వెళ్ళు మనవైపే ఉంటాయి" దీనిని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని .కాని ఇవాల్టి రాజకీయాలను,వార్తలను చూసి నేను నా వైఖరిని మార్చుకోవాలని నిర్ణయించేసుకున్నాను. నాలుగు వేళ్ళు నావైపు చూపినా సరే నా ఆలోచలని ,భావాలని మీతో పంచుకోవాలని ఈ బ్లాగ్ ప్రారంభించాను.నా ఆలోచనలు నచ్చితే ప్రోత్సహించండి,నచ్చకపోతే అజ్ఞానం తో రాశాడని నవ్వుకోండి.



ఇట్లు:

రఘువీర్. పతకమూరి